ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల !

Telugu Lo Computer
0


త్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాలను బీజేపీ ఇవాళ విడుదల చేసింది. మరి కొన్ని నెలల్లో ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఛత్తీస్‌గఢ్‌లో 21 అసెంబ్లీ స్థానాలకు, మధ్యప్రదేశ్‌లో 39 అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే మొదటి విడత అభ్యర్థుల జాబితా బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. నిన్న జరిగిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థులను ఖరారు చేశారు. ఛత్తీస్‌గఢ్ నుంచి పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాలోమాజీ సీఎం రమణ్ సింగ్ పేరు లేదు. అలాగే, మధ్యప్రదేశ్ నుంచి పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాలో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు కనపడలేదు. ఛత్తీస్‌గఢ్ లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు, మధ్యప్రదేశ్ లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.



Post a Comment

0Comments

Post a Comment (0)