బీజేపీ మహిళా నేత ఆత్మహత్య కేసులో నిందితుని పార్టీ సభ్యత్వం రద్దు !

Telugu Lo Computer
0


సోం కిసాన్‌ మోర్చా నాయకురాలు ఆత్మహత్య కేసులో నిందితునిగా ఉన్న ఓ నాయకుని పార్టీ సభ్యత్వాన్ని బీజేపీ రద్దు చేసింది. గత శుక్రవారం బీజేపీ కిసాన్ మోర్చాకు చెందిన ఓ మహిళ గౌహతిలో తన సొంత నివాసంలో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తర్వాత రాష్ట్ర బీజేపీ అధిష్ఠానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత మహిళా నాయకురాలు ఇతర పార్టీ నాయకునితో ఉన్న అశ్లీల ఫొటోలు వైరల్ అయిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వ్యవహారంలో నిందితునిగా ఉన్న పార్టీ నాయకుని సభ్యత్వాన్ని బీజేపీ రద్దు చేసింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)