లడఖ్‌లో బాంబులు వేయండి !

Telugu Lo Computer
0


డఖ్‌లో చైనా బలగాలపై భారత సైన్యం బాంబు దాడులకు దిగితే కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఇస్తుందని, తాము అభ్యంతరం చెప్పబోమని కాంగ్రెస్‌ ఎంపీ అధీర్‌ రంజన్‌ చౌదరీ అన్నారు. అవిశ్వాస తీర్మానంపై సభలో చర్చ సందర్భంగా ప్రధాని మోదీ కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేస్తూ, '1966లో ప్రధాని ఇందిరాగాంధీ మిజోరాంపై భారత్‌ ఆర్మీతో బాంబులు వేయించింది' అని అన్నారు. దీనికి అధీర్‌ బదులిస్తూ, 'మీరు ఇప్పుడు కావాలంటే లడఖ్‌లోని చైనా బలగాలపై బాంబులు వేయండి. కాంగ్రెస్‌ మద్దతు ఇస్తుంది' అని అన్నారు. పార్లమెంట్‌లో ప్రతిపక్షాల గొంతును అణచివేసే కుట్రలో భాగంగానే తనపై సభలో సస్పెన్షన్‌ వేటు పడిందని చౌదరీ అన్నారు. పార్లమెంట్‌ సభ్యుడిగా ఇలాంటి రోజును తానెప్పుడూ చూడలేదన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రమాదంలో పడిందనటానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనమని అన్నారు. సస్పెన్షన్‌పై వీలైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)