దేశానికి అసలైన యజమానులు ఆదివాసీలే ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 13 August 2023

దేశానికి అసలైన యజమానులు ఆదివాసీలే !


గిరిజన హక్కుల కోసం గళమెత్తిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈ దేశానికి నిజమైన యజమానులు ఆదివాసీలేనని అన్నారు. భూమి, అడవిపై హక్కులను గిరిజనులకు అందించాలని నొక్కిచెప్పారు. తాను దేశవ్యాప్తంగా పర్యటించిన క్రమంలో గిరిజన సోదరులను కలిశానని, ఆదివాసీలంటే భూమికి నిజమైన యజమానులని అర్ధమని చెప్పుకొచ్చారు. తాను ప్రాతినిధ్యం వహించే వయనాద్  !లోక్‌సభ నియోజకవర్గంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ దేశానికి యజమానులైన గిరిజనులు తమ బిడ్డలను ఇంజనీర్లు, డాక్టర్లు, న్యాయవాదులుగా, వ్యాపారవేత్తలుగా ఎదిగేలా చూడాలని పిలుపు ఇచ్చారు. అడవులు, భూములు, అటవీ ఉత్పత్తుల హక్కులను గిరిజనులకు చెందేలా చూడాలని కోరారు. భూమండలంలో ప్రతి ఒక్క వనరులో గిరిజనులకు వాటా ఉందని, వారిని కొన్నింటికే నియంత్రించరాదని సూచించారు. గిరిజనులను వనవాసీలని పిలవడంలో నిగూడార్ధం ఉందని అన్నారు. భారత్‌కు నిజమైన యజమానులైన గిరిజనులను అడవులకే పరిమితం చేసే ఉద్దేశంతో వనవాసీలనే పదం ప్రచారంలోకి తెచ్చారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. వయనాద్‌లోని డాక్టర్ అంబేద్కర్ జిల్లా మెమోరియల్ క్యాన్సర్ సెంటర్‌లో విద్యుత్ ప్లాంట్‌ను రాహుల్ ప్రారంభించారు. ఈ ప్లాంట్‌కు ఎంపీ నిధుల నుంచి రూ. 50 లక్షలు కేటాయిస్తున్నట్టు ఆయన ప్రకటించారు.

No comments:

Post a Comment