గిరిజన హక్కుల కోసం గళమెత్తిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈ దేశానికి నిజమైన యజమానులు ఆదివాసీలేనని అన్నారు. భూమి, అడవిపై హక్కులను గిరిజనులకు అందించాలని నొక్కిచెప్పారు. తాను దేశవ్యాప్తంగా పర్యటించిన క్రమంలో గిరిజన సోదరులను కలిశానని, ఆదివాసీలంటే భూమికి నిజమైన యజమానులని అర్ధమని చెప్పుకొచ్చారు. తాను ప్రాతినిధ్యం వహించే వయనాద్ !లోక్సభ నియోజకవర్గంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ దేశానికి యజమానులైన గిరిజనులు తమ బిడ్డలను ఇంజనీర్లు, డాక్టర్లు, న్యాయవాదులుగా, వ్యాపారవేత్తలుగా ఎదిగేలా చూడాలని పిలుపు ఇచ్చారు. అడవులు, భూములు, అటవీ ఉత్పత్తుల హక్కులను గిరిజనులకు చెందేలా చూడాలని కోరారు. భూమండలంలో ప్రతి ఒక్క వనరులో గిరిజనులకు వాటా ఉందని, వారిని కొన్నింటికే నియంత్రించరాదని సూచించారు. గిరిజనులను వనవాసీలని పిలవడంలో నిగూడార్ధం ఉందని అన్నారు. భారత్కు నిజమైన యజమానులైన గిరిజనులను అడవులకే పరిమితం చేసే ఉద్దేశంతో వనవాసీలనే పదం ప్రచారంలోకి తెచ్చారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. వయనాద్లోని డాక్టర్ అంబేద్కర్ జిల్లా మెమోరియల్ క్యాన్సర్ సెంటర్లో విద్యుత్ ప్లాంట్ను రాహుల్ ప్రారంభించారు. ఈ ప్లాంట్కు ఎంపీ నిధుల నుంచి రూ. 50 లక్షలు కేటాయిస్తున్నట్టు ఆయన ప్రకటించారు.
Post Top Ad
adg
Sunday, 13 August 2023
Home
congress
kerala
National
అడవిపై హక్కులను గిరిజనులకు అందించాలని నొక్కిచెప్పారు
దేశానికి అసలైన యజమానులు ఆదివాసీలే
భూమి
రాహుల్ గాంధీ
దేశానికి అసలైన యజమానులు ఆదివాసీలే !
దేశానికి అసలైన యజమానులు ఆదివాసీలే !
Tags
# congress
# kerala
# National
# అడవిపై హక్కులను గిరిజనులకు అందించాలని నొక్కిచెప్పారు
# దేశానికి అసలైన యజమానులు ఆదివాసీలే
# భూమి
# రాహుల్ గాంధీ
About Telugu Lo Computer
రాహుల్ గాంధీ
Tags
congress,
kerala,
National,
అడవిపై హక్కులను గిరిజనులకు అందించాలని నొక్కిచెప్పారు,
దేశానికి అసలైన యజమానులు ఆదివాసీలే,
భూమి,
రాహుల్ గాంధీ
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment