ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా ఉంటే కేంద్రంలో అధికారం ఖాయం !

Telugu Lo Computer
0


రా
బోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా వ్యవహరిస్తే కేంద్రంలో అధికారం చేజిక్కించుకునే అవకాశముందని బీజేపీ సీనియర్‌ నేత సుబ్రమణ్యస్వామి అన్నారు. చెన్నై నుంచి గురువారం ఉదయం విమానం ద్వారా మదురై వెళ్లిన సుబ్రమణ్యస్వామి విలేకరులతో మాట్లాడుతూ మణిపూర్‌లో మానవహక్కుల ఉల్లంఘన భారీస్థాయిలో జరిగిందన్నారు. చైనా మద్దతుతో ఆ రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు జరిగాయన్నారు. అయితే, ఈ విషయాన్ని పక్కనబెట్టిన ప్రధాని మోడీ  అమెరికా పర్యటనకే ప్రాధాన్యం ఇవ్వడం తనను ఆవేదనకు గురి చేసిందన్నారు. హిందువులందర్నీ ఒకే తాటిపై తీసుకొచ్చే ప్రయత్నాలు చేపట్టామని, ప్రధాని మోదీ మంచి చేస్తారని అందరూ ఎదురుచూసి చివరకు మోసపోయారని విమర్శించారు. మదురై విమానాశ్రయానికి ముత్తురామలింగ దేవర్‌ పేరు పెట్టాల్సిందిగా పార్లమెంటు నిర్ణయించిందని అయితే, అప్పటి కేంద్రమంత్రి పి.చిదంబరం దీన్ని అడ్డుకున్నట్లు అప్పటి కేంద్రమంత్రి ప్రఫుల్‌ పటేల్‌ ఈ విషయాన్ని స్వయంగా తనకు చెప్పారని తెలిపారు. ముత్తురామలింగ దేవర్‌పై ప్రేమ చూపుతున్నట్లు నటిస్తున్న డీఎంకే, అన్నాడీఎంకేలు కూడా మదురై విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టాలని పార్లమెంటులో ప్రస్తావించలేదని ఆయన తెలిపారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)