భార్య ముక్కు కోసిన భర్త !

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్ లోని లఖినంపూర్ ఖేరి జిల్లా  మితౌలీ ప్రాంతంలోని బన్‌స్తలి గ్రామంలోని విక్రమ్ అనే వ్యక్తి తన భార్య సీమ ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నాడు. విక్రమ్‌ భార్య పేరు సీమా దేవి. వారికి వివాహం జరిగి 12 ఏళ్లు అయ్యింది. ఈ క్రమంలో విక్రమ్ కు ఓ మహిళతో పరిచమైంది. అదికాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీరిద్దరు సంబంధం గురించి సీమాదేవికి తెలిసింది. భర్తను నిలదీసింది. అలా ఇద్దరు మధ్య గొడవలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో గత శనివారం భార్య సీమాదేవితో విక్రమ్ గొడవ పడ్డాడు. వారి నాలుగేళ్ల కూతురు మొబైల్ చూస్తు కూర్చుంది. ఆ మొబైల్ ఇవ్వమని విక్రమ్ అడిగాడు. అయినా చిన్నారి ఇవ్వలేదు. దీంతో విక్రమ్ కోపం నషాళానికి అంటింది. చిన్నారిని పట్టుకుని చితకబాదాడు. అది చూసిన సీమాదేవి అడ్డం వెళ్లింది. ఆ కోపం కాస్తా భార్యపై చూపించిన విక్రమ్ దారుణంగా కొట్టాడు. కోపం తీరక అక్కడే ఉన్న చాకు తీసుకుని భార్య సీమాదేవి ముక్కు కోసేశాడు. ఆ తరువాత ఆ ముక్కు ముక్కను జేబులో వేసుకుని అక్కడ నుంచి పారిపోయాడు. బాధతో సీమాదేవి పెద్ద పెద్దగా కేకలు వేసింది.దీంతో స్థానికులు వచ్చారు. విషయం తెలుసుకుని అంబులెన్స్ కు ఫోన్ చేసి సీమాదేవిని మితౌలీ ఆస్పత్రికి తరలించారు. తరువాత జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స తరువాత సీమాదేవి తల్లిదండ్రులతో కలిసి పోలీసు స్టేషన్ కు వెళ్లి భర్తపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న విక్రమ్ కోసం గాలించి పట్టుకున్నారు.   https://t.me/offerbazaramzon


Post a Comment

0Comments

Post a Comment (0)