ప్రముఖ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్కు సుప్రీంకోర్టులో మరోసారి ఊరట లభించింది. అత్యున్నత న్యాయస్థానం ఆమె మధ్యంతర బెయిల్ను పొడిగించింది. జులై 19 వరకు అరెస్టు నుంచి వెలుసుబాటు కల్పించింది. గుజరాత్లో 2002లో జరిగిన అల్లర్ల విషయంలో ప్రత్యేక దర్యాప్తు బృందానికి, పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై ఆమెపై గతంలో కేసు నమోదైంది. అమాయకులను కేసులో ఇరికించేందుకు కుట్రపన్నారంటూ ఆమెపై పోలీసులు అభియోగాలు మోపారు. ఆ కేసులో భాగంగా గతంలో గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ (ఏటీఎస్) ముంబయిలో తీస్తాను అదుపులోకి తీసుకుంది. ఆ తర్వాత ఆమె రెండు నెలల పాటు జైల్లో ఉన్నారు. తనకు బెయిల్ నిరాకరిస్తూ సెషన్స్ కోర్టు, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ తీస్తా సెతల్వాద్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై గత సెప్టెంబర్లో ఆమెకు ఊరట లభించింది. అప్పటి నుంచి మధ్యంతర బెయిల్పై ఆమె బయట ఉన్నారు. అయితే ఆమె సాధారణ బెయిల్ కోసం కొద్దిరోజుల క్రితం గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె అభ్యర్థనను గుజరాత్ హైకోర్టు తిరస్కరించడంతో పాటు తక్షణమే లొంగిపోవాలని ఆదేశించింది. అయితే ఈ విషయంలో ఆమెకు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఏడు రోజుల పాటు సుప్రీంకోర్టు ధర్మాసనం స్టే విధించింది. తాజాగా మధ్యంతర బెయిల్ను జులై 19 వరకు పొడిగించింది. https://t.me/offerbazaramzon
తీస్తా సెతల్వాద్కు మధ్యంతర బెయిల్ పొడిగింపు
July 05, 2023
0
Tags