తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో ఆకట్టుకున్న 'డ్రోన్ షో' !

Telugu Lo Computer
0


తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని దుర్గం చెరువులో డ్రోన్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డ్రోన్‌ చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. దుర్గం చెరువు వద్ద డ్రోన్ షో కనువిందు చేసింది. కేబుల్ బ్రిడ్జిపై ఒకేసారి 500 డ్రోన్స్ ప్రదర్శించారు. ఈ వేడుకలో భాగంగా ఆదివారం సాయంత్రం దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దగ్గర లేజర్, త్రీడీ షోను ప్రదర్శించారు. ఆ లేజర్​షోలో తెలంగాణ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఎంతగా అభివృద్ధి చెందిందో తెలుపుతూ వాటి ఆకృతులను ప్రదర్శించారు. మొదటగా దశాబ్ది ఉత్సవాల లోగోను చూపుతూ ఆ తర్వాత తెలంగాణ కోసం ఎందరో తమ ప్రాణాలను అర్పించిన వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ అమరవీరు స్తూపాన్ని ఏర్పాటు చేశారు. భారతదేశంలోనే అతి పెద్ద అంబేద్కర్​ విగ్రహం, తెలంగాణ శ్వేతసౌధం, కాళేశ్వరం ప్రాజెక్టు, వేముల వాడ మల్లన్న స్వామి, సీఎం కేసీఆర్, టీహబ్, పోలీసుల లోగో, మిషన్​ భగీరథ, డబుల్ బెడ్​రూం, సైబరాబాద్ పోలీస్​లోగో, షీ టీమ్స్ లోగో.. ఆఖరికి జై తెలంగాణ జై భారత్​అనే నినాదంతో లేజర్ షో​ముగిసింది. ఈ లేజర్​షోను చూసేందుకు వచ్చిన జనం.. ఆ షోను చూసి ఆనందం, ఆశ్చర్యంతో కరతాల ధ్వనులతో తెలంగాణ వేడుకలను జరుపుకున్నారు. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా వరంగల్ కమిషనరేట్ పరిధిలో సురక్షాదినోత్సవం ఘనంగా నిర్వహించారు. బైక్, పోలీస్ వాహనాలతో వినూత్న రీతిలో ర్యాలీ చేశారు పోలీసులు. ఇలా అన్ని జిల్లాల్లో సురక్షాదినోత్సవం ఘనంగా నిర్వహించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)