తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాల్లో కర్ణాటక ఫలితాలు వచ్చేలా చేస్తాం !

Telugu Lo Computer
0


అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ ఈ ఓవర్సీస్ కాంగ్రెస్-యూఎస్ఏ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొని మాడుతూ బీజేపీని చిత్తుగా ఓడించవచ్చని కర్ణాటక ఎన్నికల్లో నిరూపించామని, కేవలం ఓడించడమే కాకుండా ఆ పార్టీ పూర్తిగా క్షీణించిపోయేలా చేశామని, తదుపరి తెలంగాణలో బీజేపీని లేకుండా చేస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాక ఆ రాష్ట్రంలో బీజేపీని ఉందని గుర్తించడం కూడా కష్టమవుతుందని చెప్పారు. డిసెంబరులో తెలంగాణలో ఎన్నికలు జరగాల్సి ఉంది. తెలంగాణతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ లోనూ కర్ణాటక ఫలితాలే వచ్చేలా చేస్తామని రాహుల్ అన్నారు. ద్వేషపూరిత భావజాలం ఉన్న బీజేపీని ఓడించాలని కాంగ్రెస్ మాత్రమే కాకుండా భారత్ ప్రజలు అందరూ భావిస్తున్నారని తెలిపారు. కర్ణాటక ఎన్నికల్లో గెలుపునకు బీజేపీ ఎన్నో కుట్రలు పన్నిందని, ఆ పార్టీ వద్ద తమ కంటే 10 రెట్ల డబ్బు అధికంగా ఉందని చెప్పారు. అంతేగాక, వారిదే ప్రభుత్వమని, ఏజెన్సీలు వారివేనని అన్నారు. వారివద్ద అన్నీ ఉన్నప్పటికీ తాము గట్టిగా దెబ్బకొట్టామని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)