58 ఏట కవలలకు జన్మనిచ్చిన మహిళ !

Telugu Lo Computer
0


రాజస్థాన్ కు చెందిన 58 ఏళ్ల వయసున్న షేరా బహదూర్ కు సంతానం లేదు. పిల్లలు లేరని మనోవేధనకు గురవుతుండేది. అయితే వైద్యరంగంలో వచ్చిన ఆధునిక పద్దతుల ద్వారా సంతానం పొందవచ్చునని తెలుసుకుంది. దీంతో ఆమె బికనీర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ షెఫాలిని కలిసింది. ఆ మహిళకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఐవిఎఫ్ ప్రక్రియను ప్రారంభించారు. ఐవిఎఫ్ సక్సెస్ కావడంతో 58 ఏళ్ల మహిళ పండంటి కవలలకు జన్మనిచ్చింది. కవలల్లో ఒక పాప ఒక బాబు ఉన్నారు. తల్లీ బిడ్డలు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని వైద్యులు తెలిపారు. తల్లి కావాలన్న తన కోరిక నెరవేరడంతో ఆ మహిళ, వారి కుటుంబసభ్యులు ఆనందంలో మునిగిపోయారు.

Post a Comment

0Comments

Post a Comment (0)