ప్రధాని, బీజేపీ నేతలు దేశ ప్రజలను క్షమాపణ కోరాలి !

Telugu Lo Computer
0


గడచిన ఏడాదిగా బీజేపీ నేతలు ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి ఢిల్లీలో మద్యం కుంభకోణం జరిగిందని ఆరోపిస్తున్నారని ఆప్ ముఖ్యనేత, మంత్రి అతిషి అన్నారు. బీజేపీ నేతల ఆరోపణలే సీబీఐ, ఈడీ ఛార్జ్ షీట్ లో వచ్చాయని గుర్తుచేశారు. 6 నెలలకు పైగా సీబీఐ, ఈడీ రెండు ఏజెన్సీలకు చెందిన 500 కు పైగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారని పేర్కొన్నారు. రూ.100 కోట్ల కిక్ బ్యాక్ లు పొందారని, ఈ వంద కోట్ల రూపాయలను గోవా ఎన్నికల్లో ఖర్చు చేశారని పదే.. పదే ప్రెస్ మీట్లు పెట్టి బీజేపీ నేతలు ఆరోపణలు చేశారు. నిన్న రౌజ్ ఎవెన్యూ కోర్టు.. రాజేష్ జోషి, గౌతమ్ మల్హోత్రా కు బెయిల్ ఇచ్చింది. 85పేజీల ఆర్డర్ ఇచ్చింది.. ఈ ఆర్డర్ బిజెపి నేతలు చదివి ఉంటారని అనుకుంటున్నాను. ఒక్క పైసా కు సంబంధించి సీబీఐ, ఈడీ వద్ద ఆధారాలు లేవని కోర్టు చెప్పిందన్నారు. ముందు చెప్పిన 100 కోట్ల కిక్ బ్యాగ్ లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పలేదు. మొదట్లో వంద కోట్లు అన్నారు. ఇప్పుడు 30 కోట్లు అంటున్నారు. వాటికి కూడా ఆధారాలు లేవు. రాజేష్ జోషి ద్వారా రూ.30 కోట్లు ఢిల్లీకి వచ్చాయి.అలాగే గోవాకు వెళ్లాయని ఆరోపించారు. వారి దగ్గర వీరి నంబర్ ఉంది. వీరి దగ్గర వారి నెంబర్ ఉంది కాల్స్ చేసుకున్నారు.. ఇలాంటి అంశాలు ఆధారాలుగా పరిగణించలేమని కోర్టు తెలిపిందన్నారు. డిజిటల్ గా కానీ హవాలా ఆపరేటర్ వద్ద కానీ డబ్బు తరలించినట్లు ఆధారాలు సమర్పించలేదన్న న్యాయస్థానం. స్వతంత్ర ఆధారాలు ఏవి దర్యాప్తు సంస్థ సేకరించలేదని కోర్టు చెప్పింది. గడచిన 6 నెలలు గా ఈడీ, సీబీఐ అధికారులు గోవాలో తిష్ట వేసింది. గోవాలో ఆమాద్మీ పార్టీకి పనిచేసిన వెండర్స్ వద్ద తనిఖీలు, విచారణ చేశారు. చివరికి గోవా ఎన్నికల్లో ఆప్ రూ.19లక్షలు నగదు ఖర్చు చేసిందని చెప్పారు. ఆప్ అత్యంత నిజాయితీ పార్టీ అని దర్యాప్తు సంస్థల తేల్చేసాయని అతిషి తెలిపారు. అల్లరి అల్లరి చేస్తున్న బీజేపీ నేతలు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ కోరాలి. ఛార్జ్ షీట్ లు సీబీఐ, ఈడీ రాయడం లేదు. ప్రధాన మంత్రి కార్యాలయంలో సిద్ధం చేస్తున్నారు. వారు రాసినదానికి ఆధారాలు సేకరించమని అధికారులపై వత్తిడి చేస్తున్నారు. దర్యాప్తులో అధికారులు తమపై దాడులు చేస్తున్నారు. భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విచారణ ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరు చెప్పారు. ఏ ఆధారాలతో ఫోన్లు ధ్వంసం చేసారని అధికారులు ముందే చెబుతున్నారు. అబద్ధపు ఆధారాలను సృష్టిస్తున్నారని తెలిపారు. మొదట సంజయ్ సింగ్ పేరు పేర్కొన్నారు. లీగల్ నోటీసు పంపగానే తప్పు జరిగిందని క్షమాపణ కోరారు. మద్యం కుంభకోణంలో వస్తున్న పేర్లు అన్ని అవాస్తవాలు.. అసలు కుంభకోణం జరగలేదు. ప్రధాని, బీజేపీ నేతలు దేశ ప్రజల క్షమాపణ కోరాలి. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ఆప్ పార్టీని బీజేపీ ఉద్దేశపూర్వకంగానే బద్నాం చేస్తున్నారు. మనీష్ సిసోడియా కు వ్యతిరేకంగా కూడా ఇప్పటివరకు దర్యాప్తు సంస్థలు కోర్టుకు ఆధారాలు సమర్పించలేదని ఆప్ నేత అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)