బెంగళూరులో రెండో రోజు సాగిన మోడీ రోడ్‌షో - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 7 May 2023

బెంగళూరులో రెండో రోజు సాగిన మోడీ రోడ్‌షో


ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బెంగళూరు వ్యవస్థాపకుడు కెంపెగౌడ విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన అనంతరం ఈస్ట్, సెంట్రల్ బెంగళూరులోని సుమారు అరడజను అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా రోడ్‌షా సాగినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాహనంలో మోడీ ఈ యాత్ర సాగించారు. ఆయన వెంట కర్ణాటక రాజ్యసభ సభ్యుడు, కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, బెంగళూరు సెంట్రల్ ఎంపీ పీసీ మోహన్ కూడా వాహనంలో ప్రయాణించారు. రోడ్లపైన, భవనాలపైన పెద్దసంఖ్యలో గుమిగూడిన ప్రజానీకానికి మోడీ అభివాదం చేయడంతో, అందుకు ప్రతిగా వారు...మోదీ మోదీ, భారత్ మాతాకీ జై నినాదాలు చేశారు. పలు ప్రాంతాల్లో వాయిద్యాలు మోగిస్తూ పండుగ వాతావరణం కనిపించింది. మెల్లగా ప్రయాణిస్తూ ముందుకు సాగిన మోదీపైన, ఆయన వాహన శ్రేణిపైన ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు పుష్పవర్షం కురిపించారు. ట్రినిటీ సర్కిల్‌కు రోడ్‌షో చేరుకోగానే మోదీ ముకుళిత హస్తాలతో ప్రజలకు అభివాదం చేశారు. మోడీ రోడ్‌షో సందర్భంగా పలు చోట్లు బారికేడ్లు ఏర్పాటు చేశారు. భారీ భద్రతా ఏర్పాట్లు జరిగాయి. 

No comments:

Post a Comment