తమిళనాడులోని తిరువళ్లూరులో వివాహ వేడుకలో ప్రమాదవశాత్తు మరుగుతున్న రసంలో పడి ఒక యువకుడు మృతి చెందాడని అధికారులు తెలిపారు. బాధితుడు కాలేజీ విద్యార్థి అని, పార్ట్ టైం జాబ్గా క్యాటరింగ్ పనిచేస్తున్నట్లు తెలిపారు. అతిధులకు వడ్డన చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. బాధితుడిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించినప్పటికీ తీవ్ర కాలిన గాయలవ్వడంతో చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిపారు. అతను తీవ్రంగా గాయపడటంతో శరీరం ట్రీట్మెంట్కి సహకరించలేదని అందువల్లే అతడి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరుగుతున్న రసంలో పడి ఒక యువకుడు దుర్మరణం !
May 01, 2023
0
Tags