ప్రమోషన్ లిస్టులో చీఫ్ జస్టిస్ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, కేవీ విశ్వనాథన్‌లకు చోటు !

Telugu Lo Computer
0


సుప్రీంకోర్టు కొలీజియం ప్రమోషన్‌ లిస్టులో ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాకు చోటు దక్కింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పీకే మిశ్రాతో పాటు సీనియర్ న్యాయవాది కేవీ విశ్వనాథన్‌ల పేర్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించేందుకు కొలీజియం సిఫార్సు చేసింది. వీరి పేర్లను కేంద్ర ప్రభుత్వానికి పంపిన తర్వాత న్యాయ మంత్రిత్వ శాఖ ఆమోదించాల్సి ఉంటుంది. సాధారణంగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను న్యాయ శాఖ యథాతథంగా ఆమోదిస్తూ ఉంటుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)