జూన్ 4న కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశం !

Telugu Lo Computer
0


నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది కొంచెం ఆలస్యంగా రానున్నాయి. జూన్ 4వ తేదీన కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1 నాటికి దేశంలో ప్రవేశిస్తాయి. ఈసారి నాలుగు రోజులు ఆలస్యం కానుంది. ఇక, ఈ ఏడాది రుతుపవనాలు సాధారణ వర్షపాతాన్ని అందిస్తాయని ఐఎండీ తెలిపింది. భారత్ లోకి ప్రవేశించిన రుతుపవనాలు ఎంత త్వరగా మిగతా భాగాలకు వ్యాపిస్తాయన్న దానిపై ఆ ఏడాది వర్షపాతం ఆధారపడి ఉంటుంది. రుతుపవనాలు ఆలస్యంగా విస్తరిస్తే ఆ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని, రుతుపవనాలు త్వరగా విస్తరిస్తే సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని నిపుణులు చెబుతుంటారు. ఐఎండీ ఇటీవల వెలువరించిన అంచనాల నివేదికలో. భారత్ లో ఈ ఏడాది నైరుతి సీజన్ లో 96 శాతం వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. ఈ అంచనా 5 శాతం అటూ ఇటూగా ఉండొచ్చని వివరించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)