గో ఫస్ట్ విమానం సంస్థకు విమాన నియంత్రణ సంస్థ డీజీసీఏ ఈరోజు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వెంటనే విమాన బుకింగ్స్ను నిలిపివేయాలని, మళ్లీ ఆదేశాలు ఇచ్చే వరకు ఎటువంటి టికెట్లను అమ్మరాదు అని డీజీసీఏ తన ఆదేశాల్లో పేర్కొన్నది. సురక్షితంగా, సమర్థవంతంగా, నమ్మకమైన రీతిలో సేవలు అందించడం లేదని ఆ సంస్థను నిలదీసింది. షోకాజు నోటీసుపై 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని డీజీసీఏ తెలిపింది. ఆ వివరణ ఆధారంగానే గోఫస్ట్ విమాన ఆపరేషన్స్కు సర్టిఫికేట్ వస్తుందని పేర్కొన్నది. మే 15వ తేదీ వరకు ప్రయాణికుల టికెట్లను అమ్మడం నిలిపివేయాలని గోఫస్ట్కు ఇటీవల డీజీసీఏ ఆదేశించిన విషయం తెలిసిందే. అంతేకాదు మే 12వ తేదీ వరకు ఆ సంస్థకు చెందిన అన్ని ఫ్లయిట్లను రద్దు చేశారు. వాడియా గ్రూపునకు చెందిన గోఫస్ట్ సంస్థను గతంలో గోఎయిర్గా పిలిచేవారు. స్వచ్ఛంధ దివాళా కింద నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముందు ఆ కంపెనీ దరఖాస్తు చేసుకున్నది.
వెంటనే టికెట్లు అమ్మడం ఆపేయండి !
May 08, 2023
0
Tags