నువ్వు చావు, మరో యువతిని పెళ్లి చేసుకుంటే భారీగా కట్నం వస్తుందని ఓ భర్త భార్యకు నిత్యం నరకం చూపిస్తున్నాడు. చిత్రహింసలు భరించలేక భార్య అతి కష్టం మీద స్వదేశానికి చేరుకుని పోలీసులను ఆశ్రయించింది. శంషాబాద్ ఇన్స్పెక్టర్ ఎ.శ్రీధర్ కుమార్ తెలిపిన కథనం ప్రకారం.. తెలంగాణ లోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలానికి చెందిన యువతి(32)తో శంకరపల్లి మండలం మహాలింగపురానికి చెందిన ప్రవీణ్రెడ్డికి 2017లో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. పెళ్లయిన దంపతులు అమెరికాకు వెళ్లారు. వారికి ఓ బాబు ఉన్నాడు. కొంతకాలంగా అదనపు కట్నం కోసం ప్రవీణ్రెడ్డి భార్యను చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. అదనపు కట్నం ఇవ్వకపోవడంతో పలుమార్లు దాడి చేసి ఆమెకు భోజనం, మంచినీళ్లు ఇవ్వకుండా గదిలో బంధించి భయభ్రాంతులకు గురి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Post a Comment
0Comments
3/related/default