ఇండిగో విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 25 May 2023

ఇండిగో విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం


160 మంది ప్రయాణికులతో దుబాయ్ వెళ్తున్న ఇండిగో విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్ అవుతుండగా పక్షి ఢీకొట్టింది. గురువారం ఉదయం మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలోని టాక్సీవే నుంచి రన్‌వేలోకి ప్రవేశిస్తుండగా పక్షి ఢీకొట్టింది. పక్షి విమాన రెక్కలను బలంగా ఢీకొట్టడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. 6E 1467 మంగళూరు-దుబాయ్ ఉదయం 8.25 గంటలకు బయలుదేరాలి. విమానం టాక్సీవే నుంచి రన్‌వేలోకి ప్రవేశించినప్పుడు పక్షి ఢీకొన్నట్లు MIA ప్రతినిధి తెలిపారు. పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి సమాచారం అందించాడు. విమానం ఉదయం 8.30 గంటలకు తిరిగి ఆప్రాన్‌కు చేరుకుంది. అనంతరం ప్రయాణీకులందరినీ దించేశారు. విమానాన్ని ఇంజినీరింగ్ అధికారులు తనిఖీ చేశారు. ఆ తర్వాత ప్రయాణికులను మరో ఇండిగో విమానంలో దుబాయి వెళ్లేందుకు ఏర్పాటు చేశారు. రీషెడ్యూల్ చేసిన దుబాయ్ విమానం ఉదయం 11.05 గంటలకు దుబాయ్ బయలుదేరింది. 

No comments:

Post a Comment