దేశంలో కొత్తగా 3,720 కరోనా కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో గడిచిన 24 గంటల్లో 1,50,735 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 3,720 కొత్త కేసులు బయటపడ్డాయని దీంతో  మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,49,56,716కి చేరిందని  కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 40,177 కేసులు యాక్టివ్‌ గా ఉన్నాయి. ఇప్పటి వరకు మహమ్మారి నుంచి 4,43,84,955 మంది కోలుకున్నారు. గత 24 గంటల వ్యవధిలో 20 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం కొవిడ్‌ మరణాల సంఖ్య 5,31,584కి చేరింది. ఇక ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 0.09 శాతం మాత్రమే యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. రికవరీ రేటు 98.73 శాతంగా, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 220.66 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)