కాంగ్రెస్ లోకి ధర్మపురి శ్రీనివాస్

Telugu Lo Computer
0


ఒకప్పుడు కాంగ్రెస్ లో కీలకనేతగా, పిసిపి చీఫ్ గా, రాష్ట్ర మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించిన ధర్మపురి శ్రీనివాస్ కొంతకాలం క్రితం టిఆర్ఎస్ లో చేరారు. అందులో ఆయన క్రీయశీలకంగా వ్యవహరించలేకపోయారు. ఆయన  తిరిగి తన స్వంతగూటికి చేరారు. హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారుఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్, మాజీ పీసీసీ అధ్యక్షుడు హనుమంతరావు. ఆయనతో పాటు ఆయన తనయుడు , నిజమాబాద్ మాజీ మేయర్ సంజయ్ , సీనియర్ నేత మేడ్చల్ సత్యనారాయణ కూడా హస్తం తీర్ధం పుచ్చుకున్నారు.. కార్యక్రమంలో ఎంపీలు ఉత్తమ్ , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్, పొన్నాల లక్ష్మయ్య, రేణుకా చౌదరి, తదితర నేతలు పాల్గొన్నారు.. ఇది ఇలా ఉంటే ధర్మపురి శ్రీనివాస్ తనయుడు అరవింద్ బిజెపి పార్టీ లోక్ సభ సభ్యుడిగా నిజమాబాద్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)