ప్రధాని మోడీ ఉగాది శుభాకాంక్షలు !

Telugu Lo Computer
0


ప్రధాని నరేంద్ర  మోడీ పలు రాష్ట్రాల ప్రజలకు కొత్త సంవత్సర శుభాక్షాంక్షలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల ఆనందం, శ్రేయస్సును ఆయన ఆకాంక్షించారు. వరసగా వివిధ రాష్ట్రాల సంప్రదాయ కొత్త సంవత్సరంపై ట్వీట్స్ చేశారు. ప్రధాని నరేంద్ర  మోడీ పలు రాష్ట్రాల ప్రజలకు కొత్త సంవత్సర శుభాక్షాంక్షలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల ఆనందం, శ్రేయస్సును ఆయన ఆకాంక్షించారు. వరసగా వివిధ రాష్ట్రాల సంప్రదాయ కొత్త సంవత్సరంపై ట్వీట్స్ చేశారు. ఇదే విధంగా నవరాత్రి ప్రారంభం సందర్భంగా ప్రజలకు విషెస్ చెప్పారు. సాంప్రదాయ హిందీ నూతన ఏడాది ' విక్రమ్ సంవత్' ప్రారంభమైన రోజుతో దేశం పురోగతి కొత్త శిఖరాలకు చేరుకోవాలని ప్రధాని కోరుకున్నారు. సింధీ కమ్యూనిటీకి 'చేతి చంద్'శుభాక్షాంక్షలు తెలియజేశారు. మణిపూర్ లో ప్రత్యేకంగా జరుపుకునే సజీబు చీరాబాపై ట్వీట్ చేశారు. తెలుగు వారికి ఉగాది, మహారాష్ట్ర ప్రజలకు గుడి పడ్వా, నవ్రేహ్ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుగులో శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)