హెచ్ఎస్సీ బోర్డ్ మ్యాథమెటిక్స్ పేపర్ లీక్ కేసు దర్యాప్తులో ముంబై క్రైమ్ బ్రాంచ్ బృందం మ్యాథమెటిక్స్తో పాటు ఫిజిక్స్, కెమిస్ట్రీ పేపర్లను కూడా మేనేజ్మెంట్ సిబ్బంది లీక్ చేసినట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మార్చి 3న మ్యాథమెటిక్స్ పేపర్ లీక్ కావడానికి ముందు, ఫిబ్రవరి 27న ఫిజిక్స్, మార్చి 1న కెమిస్ట్రీ పేపర్లు లీక్ అయ్యాయని, పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు గంట ముందు వాట్సాప్ ద్వారా షేర్ చేశారని అధికారి తెలిపారు. “వాట్సాప్ ద్వారా ప్రశ్న పత్రాలను పంచుకున్నారు. అహ్మద్నగర్లోని మాతోశ్రీ భాగూబాయి భంబరే అగ్రికల్చర్ అండ్ సైన్స్ జూనియర్ కాలేజీ సిబ్బందిని అరెస్టు చేసి వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నాం” అని ముంబై పోలీసులు వెల్లడించారు. మరో రెండు పేపర్లు లీక్ అయినట్లు రుజువు చేసే కొన్ని ఆధారాలు దొరికాయని క్రైం బ్రాంచ్ అధికారి తెలిపారు. అరెస్ట్ అయిన సిబ్బంది వాట్సాప్ డేటాను పరిశీలించగా పోలీసులకు తగిన ఆధారాలు లభించాయని క్రైమ్ బ్రాంచ్ అధికారి తెలిపారు.
12వ తరగతి ఫిజిక్స్, కెమిస్ట్రీ పేపర్లు కూడా లీక్
March 17, 2023
0
Tags