సిసోడియాకు మళ్లీ సిబిఐ సమన్లు - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 18 February 2023

సిసోడియాకు మళ్లీ సిబిఐ సమన్లు

 


ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆదివారం విచారణకు హాజరుకావాలని సిబిఐ శనివారం ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సమన్లు వెలువరించింది. కేసుకు సంబంధించి సిబిఐ మూడు నెలల క్రితం ఛార్జీషిట్ దాఖలు చేసింది. ఇందులో నిందితుడిగా సిసోడియాను సిబిఐ చేర్చలేదు. అయితే ఆయనపైనా ఇతరులపైనా విచారణ సాగుతున్న క్రమంలో విచారణకు రావాలని సిసోడియాకు సమన్లు పంపించినట్లు సిబిఐ వర్గాలు తెలిపాయి. కేసుకు సంబంధించి గత ఏడాది అక్టోబర్ 17వ తేదీన సిబిఐ ఈ ఆప్ నేతను విచారించింది. ఆయన నివాసం, బ్యాంకులాకర్లలో తనిఖీలు నిర్వహించింది. ఇప్పటికీ విచారణ సాగుతున్నందున మరిన్ని కీలక వివరాలు రాబట్టుకునేందుకు సిసోడియాను విచారిస్తున్నట్లు సిబిఐ తెలిపింది. 

No comments:

Post a Comment