బీహార్లోని గయా ప్రాంతంలో తన్కుప్ప రైల్వే స్టేషన్ నుంచి ఒక గూడ్సు రైలు బయలుదేరింది. సరిగ్గా అదే సమయంలో ఒక మహిళ రైల్వే ట్రాక్ దాటేందుకు ప్రయత్నించింది. తనవైపుకి రైలు దూసుకెళ్తున్నా, ఎట్టి పరిస్థితుల్లోనైనా పట్టాలు దాటాలని అడుగు ముందుకేసింది. ఈ కంగారులో ఆమె కాలుజారి పట్టాలపై పడింది. ఇంతలో ట్రెయిన్ దూసుకురావడంతో, పట్టాల మధ్య పడుకుంది. రైలు వెళ్లిపోయేంతవరకు కదలకుండా, అలాగే ఉండిపోయింది. ఈ ఘటనలో ఆమె తలకు గాయాలు అయ్యాయి. పట్టాల కింద ఆమెను గమనించిన పోలీసులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకొని, రైలు వెళ్లాక ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అంత అవసరం ఏమొచ్చిందని పట్టాలు దాటేందుకు ప్రయత్నించావు? అని అడిగితే అవతల ప్లాట్ఫామ్లో ఉన్న ట్రైన్ని అందుకోవడం కోసమే తాను అలా చేశానని ఆమె సమాధానం ఇచ్చింది. ఆ రైలు ఎక్కడ వెళ్లిపోతుందన్న ఆందోళనలో, పట్టాలు దాటేందుకు ప్రయత్నించానని, కానీ ఇలా జరుగుతుందని తాను ఊహించలేదని ఆమె పేర్కొంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా నిలకడగానే ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఒకరు సెల్ఫోన్లో రికార్డ్ చేసి నెట్టింట్లో పెట్టగా, ఆ వీడియో వైరల్ అయ్యింది.
Post Top Ad
adg
Saturday, 11 February 2023
Home
bihar
అదృష్టమంటే ఇదేనేమో
ట్రెయిన్ దూసుకురావడంతో
పట్టాల మధ్య పడుకుంది
వీడియో వైరల్
అదృష్టమంటే ఇదేనేమో !
అదృష్టమంటే ఇదేనేమో !
Tags
# bihar
# అదృష్టమంటే ఇదేనేమో
# ట్రెయిన్ దూసుకురావడంతో
# పట్టాల మధ్య పడుకుంది
# వీడియో వైరల్
About Telugu Lo Computer
వీడియో వైరల్
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment