గుజరాత్లోని సూరత్ జిల్లాలో శనివారం తెల్లవారు జామున భూకంపం సంభవించిందని, ఇది రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రతతో ఉన్నదని ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ రీసెర్చ్ అధికారి తెలిపారు. సూరత్కు పశ్చిమ నైరుతికి 27 కిమీ. దూరంలో భూకంప కేంద్రం అర్ధరాత్రి 12.52 గంటలకు నమోదయిందని ఆయన తెలిపారు. 'ఇది 5.2 కిమీ. లోతుగా నమోదయింది. కాగా భూకంప కేంద్రం జిల్లాలోని హజీరాలో..అరేబియా సముద్రంలో ఉంది. ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు' అని జిల్లా విపత్తు నిర్వహణ అధికారి తెలిపారు.
గుజరాత్లో భూకంపం !
February 11, 2023
0
Tags