యూఎన్‌లో జమ్మూకశ్మీర్‌ అంశాన్నిప్రస్తావించిన పాకిస్తాన్‌ !

Telugu Lo Computer
0


ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్తాన్‌ మరోసారి రెచ్చగొట్టే వైఖరి ప్రదర్శించింది. ఉక్రెయిన్‌ అంశంపై గురువారం నిర్వహించిన యూఎన్‌ జనరల్‌ అసెంబ్లీ ప్రత్యేక సెషన్‌ సందర్భంగా జమ్మూకశ్మీర్‌ అంశాన్ని పాక్‌ రాయబారి ప్రస్తావించారు. దీనిపై యూఎన్‌ భారత ప్రతినిధి ప్రతీక్‌ మాథుర్‌ స్పందించారు. పాక్‌ వైఖరి విచారకరమని, తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నదని మండిపడ్డారు. కాగా, ఉక్రెయిన్‌లో సమగ్ర, శాశ్వతమైన శాంతిని నెలకొల్పే అంశంపై జనరల్‌ అసెంబ్లీలో తీసుకొచ్చిన ఓటింగ్‌కు భారత్‌ దూరంగా ఉన్నది. ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారానికి మనం దగ్గరిగా ఉన్నామా? అని భారత రాయబారి రుచిరా అన్నారు. గాంధీజీ శాంతి సందేశంపై భారత్‌ ప్రత్యేక చర్చ నిర్వహించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)