నిత్యానంద కైలాసతో నెవార్క్‌ సిటీ ఒప్పందం !

Telugu Lo Computer
0


నిత్య వివాదాల స్వామిగా పేరొందిన నిత్యానంద కైలాస రాజ్యాన్ని ప్రకటించినప్పుడు ఎవరు నమ్మలేదు. కానీ అమెరికాలోని ఓ రాష్ట్రం ఆ దేశాన్ని గుర్తించింది. అంతేకాదు నిత్యానంద కైలాసంతో నెవార్క్‌ సిటీ ద్వైపాక్షిక ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఇక తన దేశానికి అమెరికానే గుర్తింపు ఇచ్చిందని నిత్యానంద ప్రచారం చేసుకుంటున్నారు. న్యూజెర్సీ రాష్ట్రంలోని నెవార్క్‌ సిటీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. న్యూజెర్సీ రాష్ట్రంలో ఎక్కువ జనాభా కలిగిన సిటీగా నెవార్కకు పేరుంది. సిటీ కౌన్సిల్‌ నిత్యానంద కైలాస దేశంతో ఒప్పందం కుదుర్చుకోవడం సంచలనం రేపుతోంది. అమెరికాలో ప్రతి రాష్ట్రానికో చట్టం అమల్లో ఉంటుంది. ఎవరికి వాళ్లు సొంతంగా ఒప్పందాలు కుదుర్చుకునే వీలుంటుంది. లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద 50 సార్లు కోర్టుకు హాజరై, 2019 నవంబర్ లో భారత్ వదిలి పరార్ అయ్యారు. ప్రస్తుతం కైలాస అనేది నిత్యానంద ప్రపంచం. దానికి తనని తాను ప్రధానిగా ప్రకటించుకున్నారు. కైలాసను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితికి అభ్యర్థన చేసుకున్నారు. కొద్దిరోజులకు కైలాస డాలర్ ను తీసుకొచ్చారు. ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాసను కూడా ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈక్వెడార్ సమీపంలోని ఓ ద్వీపాన్ని నిత్యానంద కైలాసంగా మార్చి ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు నిత్యానంద కైలాసానికి అమెరికా స్థాయిలో గుర్తింపు వచ్చే సరికి ఎప్పటికైనా ఐక్యరాజ్యసమితి గుర్తింపును సైతం పొందుతామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు నిత్యానంద పరివారగణం.

Post a Comment

0Comments

Post a Comment (0)