ఢిల్లీలో ఉగ్రకుట్ర భగ్నం !

Telugu Lo Computer
0


ఢిల్లీలో జహంగీర్‌ ప్రాంతంలో ఇద్దరు అనుమానితులను ఢిల్లీ పోలీస్‌ ప్రత్యక విభాగం గురువారం అదుపులోకి తీసుకున్నది. వీరిద్దరు గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు దేశ రాజధానిలో పెద్ద కుట్రకు ప్లాన్‌ చేసినట్లు సమాచారం. పోలీసులు అరెస్టు చేసిన ఇద్దరిలో ఒకరికి కెనడాలో ఉన్న ఖలీస్థానీ ఉగ్రవాది అర్హ్‌దీప్‌ దల్లాతో సంబంధం ఉన్నట్లు తెలిసింది. రెండు లక్షిత దాడులకు ప్లాన్ చేసినట్లు సమాచారం. నిందితుడి మొబైల్ నుంచి ఉగ్రవాదుల ప్లాన్ బ్లూప్రింట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్‌కు చెందిన అర్ష్‌దీప్ దల్లా అనే ఉగ్రవాది. కాగా, అర్ష్‌దీప్ దల్లాను రెండు రోజుల క్రితం హోం మంత్రిత్వ శాఖ ఉగ్రవాదిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)