న్యూజిలాండ్తో హైదరాబాద్లో జరిగిన తొలి వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా టీమిండియాకు మ్యాచ్ ఫీజులో రూ. 39.6 లక్షలు కోత పడింది. మ్యాచ్లో నిర్ణీత సమయానికి భారత్ 3 ఓవర్లు వెనకపడింది. ఈ విషయాన్ని మ్యాచ్ రెఫరీ జవగళ్ శ్రీనాథ్ ఐసీసీకి నివేదించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ తన తప్పును అంగీకరించాడు. దాంతో భారత జట్టు మ్యాచ్ ఫీజులో రూ.39.6 లక్షలను ఐసీసీ కోత విధించింది. ప్రతి ఆటగాడికి మ్యాచ్ ఫీజులో 60 శాతం ఫైన్ పడనుంది.
టీమిండియాకు మ్యాచ్ ఫీజులో కోత
January 20, 2023
0
Tags