బుర్ఖాలలో ములాఖత్ కు వచ్చి ఖైదీలకు గంజాయి అందజేత !

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్‌లో జైలులో గంజాయి సరఫరా చేస్తున్న షబ్నం, మదీనా, షహనాజ్, షబానా అనే నలుగురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళలు తమ బుర్కాలలో గంజాయి దాచిపెట్టి జైలులోని ఖైదీలకు అందజేస్తున్నట్లు గుర్తించారు. తాజా తనిఖీలలో వారి బుర్కాలలో దాచి ఉంచిన 4 కిలోల గంజాయిని గుర్తించారు. జైలులో ఇమ్రాన్, ఇస్మాయిల్ అనే ఇద్దరు ఖైదీలు ఈ గంజాయిని తోటి ఖైదీలకు విక్రయిస్తున్నట్లు అధికారుల విచారణలో తేలింది. భారతీయ శిక్షాస్మృతిలోని ఎన్డీపీఎస్ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇకపై బుర్ఖా ధరించి వచ్చే మహిళలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని జైలులో ఉన్న మహిళా సిబ్బందిని కోరినట్లు జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. జైలులో గంజాయి బ్యాచ్ నెట్‌వర్క్ పెద్దది కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతర నిందితుల నుంచి మరింత సమాచారం సేకరిస్తున్నారు. ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నామని, మరొకరు ఎవరూ ఇలాంటి ప్రయత్నాలు చేయకుండా నిందితులపై కఠిన చర్యలకు సిఫార్సు చేస్తామని జైలు అధికారులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)