ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు మండలం బాలగంగనపల్లికి చెందిన హుస్సేన్ బస్సు ఆగిందని రోడ్డు దాటే ప్రయత్నం చేశారు. వాహనాలు కదలడంతో వృద్ధుణ్ని గమనించకుండా డ్రైవర్ బస్సును కదిలించారు. వాహనం ఢీకొట్టడంతో అక్కడే కిందపడి వాహనం కిందకు వెళ్లిపోయాడు. కొద్ది దూరం ఆయనను బస్సు ఈడ్చుకెళ్లింది. వాహనదారులు, స్థానికులు కేకలు వేయడంతో డ్రైవర్ బస్సును నిలిపేశారు. నిర్ఘాంతపోయిన వృద్ధుణ్ని స్థానికులు బయటకు తీశారు. ప్రమాదంలో ఆయన కాలికి గాయం కావటంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు.
రోడ్డు దాటే ప్రయత్నంలో బస్సు కిందపడ్డ వృద్ధుడు !
January 22, 2023
0