నిజాం వారసుడిగా అజ్మత్‌ జా

Telugu Lo Computer
0


హైదరాబాద్‌ నిజాం వారసుడిగా మీర్‌ మహ్మద్‌ అజ్మత్‌ అలీఖాన్‌ అజ్మత్‌ జా ఎంపికయ్యారు. ప్రిన్స్‌ ముకర్రమ్‌ జా మృతి అనంతరం ఆయన వారసుడిగా అజ్మత్‌ జాను ఎంపిక చేశామని కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబసభ్యులు, సన్నిహితులు, నిజాం టస్ట్రీల మధ్య సంప్రదాయ పద్ధతిలో ఈ ప్రక్రియను నిర్వహించామని చౌమహల్లా ప్యాలెస్‌ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. నిజాం చివరి వారసుడు ప్రిన్స్‌గా పేరొందిన ముకర్రమ్‌ జా వారం రోజుల కిందట మరణించడంతో ఆయన కుమారుడు అజ్మత్‌ జాను వారసుడిగా ఎంపిక చేశారు. 1960లో జన్మించిన అజ్మత్‌ జా లండన్‌లోనే ప్రాథమిక, ఉన్నత చదువులు చదివారు. ఫొటోగ్రఫీని వృత్తిగా ఎంచుకున్నారు. కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి ఫొటోగ్రఫీ పట్టా పొందారు. హాలీవుడ్‌లో కొన్ని సినిమాలకు డైరెక్టర్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ విధులు నిర్వహించారు. హాలీవుడ్‌ దిగ్గజాలు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌, రిచర్డ్‌ అటెన్‌బరోలతో కలిసి పనిచేశారు. పలు లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలు చిత్రీకరించారు. లండన్‌లో నివసిస్తున్నా తన వ్యాపారాలు, డాక్యుమెంటరీ చిత్రీకరణలకు పలుదేశాలకు రాకపోకలు సాగిస్తున్నారు. తండ్రి ముకర్రమ్‌ జా అంత్యక్రియల పూర్తికి వారం రోజుల కిందట హైదరాబాద్‌ వచ్చిన ఆయన ప్రస్తుతం పాత బస్తీలోని తన పూర్వీకుల నివాసంలో ఉంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)