దేశంలో గడిచిన 24 గంటల్లో 1,94,968 మంది కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా, కొత్తగా 174 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. కొత్త కేసులతో కలిసి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4, 46,80,757 కి చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు మరణించిన వారి 5,30,725కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,257 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.01 కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.80 శాతంగా, మరణాల రేటు 1.19శాతంగా ఉంది. మొత్తం నమోదు అయిన పాజిటివ్ కేసుల్లో 0.01 కేసులు మాత్రమే యాక్టివ్గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు 220.16 కోట్ల కరోనా టీకాలను పంపిణీ చేసినట్లు తెలిపారు.
దేశంలో కొత్తగా 174 కరోనా కేసులు నమోదు
January 13, 2023
0
Tags