ఓ యువకుడు తనను కిడ్నాప్ చేసి రెండురోజుల పాటు అత్యాచారం చేశాడని రాజస్థాన్లో ఓ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను కిడ్నాప్ చేయడం నిజమేనని కానీ అత్యాచారం చేయలేదని విచారణలో అతడు చెప్పాడు. ఆ తర్వాత నిందితుడు అబ్బాయి కాదు, అమ్మాయని తేలింది. దీంతో పోలీసులు అవాక్కయ్యారు. తాను అబ్బాయిని కానని, మూడేళ్ల పాపకు తల్లి అని విచారణలో తెలిపింది. బాలికను ఎత్తుకువెళ్లినా ఎటువంటి లైంగిక చర్యలకు పాల్పడలేదని చెప్పింది. వైద్య పరీక్షల్లో ఇది నిజమేనని తేలింది. దీంతో ఇది కిడ్నాప్ కేసు మాత్రమేనని, అత్యాచారం కేసు కాదని పోలీసులు తేల్చారు. 'జీవితంలో ఎదురుదెబ్బలు తగలడంతో జట్టు కత్తిరించుకుని, అబ్బాయిలా జీవించడం మొదలుపెట్టా. హోటళ్లలో పనిచేశా. ఒక్కొక్కరికి ఒక్కో పేరు చెప్పేదాన్ని' అని నిందితురాలు వివరించింది.
కిడ్నాప్ చేసింది అబ్బాయి కాదు, అమ్మాయి !
December 18, 2022
0
Tags