ఈడీ పరిధిలోకి మరో 15 సంస్థలను తెస్తూ నోటిఫికేషన్ జారీ !

Telugu Lo Computer
0


ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) ను కేంద్రం మరింత శక్తివంతం చేసింది. మరో 15 సంస్థలను ఈడీ పరిధిలోకి తెస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. పీఎంఎల్‌ఏ చట్టంలోని 66వ నిబంధనలో కేంద్రం మార్పులు చేసింది. రాష్ట్ర పోలీసు విభాగాలను కూడా ఈడీ పరిధిలోకి తీసుకువచ్చింది. ఈడీ కోరిన ఏ సమాచారాన్నైనా ఇవ్వాల్సిందేనంటూ నోటిఫికేషన్‌లో వెల్లడించింది. విదేశాంగశాఖ, ఎన్‌ఐఏతో పాటు 15 కేంద్ర మంత్రిత్వ శాఖలను ఈడీ పరిధిలోకి తీసుకువస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)