గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతల్లో జరుగనున్నాయి. మొదటి దశలో డిసెంబర్ 8న 89 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి దశ ఎన్నికల కోసం ఈ నెల నోటిఫికేషన్ జారీ కాగా.. ఈ నెల 14తో నామినేషన్ల ఘట్ట ముగియనున్నది. 15 నామినేషన్ల పరిశీలన, 17వ వరకు ఉపసంహరణకు అవకాశం ఉన్నది. అయితే, మొదటి దశ ఎన్నికల కోసం ఇప్పటి వరకు 447 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. రేపటితో నామినేషన్ల పర్వం ముగియనుండడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉన్నది.
గుజరాత్ అసెంబ్లీకి రేపటితో మొదటి దశ నామినేషన్లకు తెర !
November 13, 2022
0
Tags