అసోం సీఎం వ్యాఖ్యలను తోసిపుచ్చిన శశి థరూర్‌

Telugu Lo Computer
0


కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో శశి థరూర్‌కు ఓటు వేసిన నేతలంతా బీజేపీలో చేరతారని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలను శశి థరూర్ తోసిపుచ్చారు. శర్మ ప్రకటన పట్ల శశి థరూర్ విస్మయం వ్యక్తం చేస్తూ పోరాటపటిమతో కూడిన ధైర్యవంతులెవరూ బీజేపీలో చేరబోరని స్పష్టం చేశారు. పోరాడే ధైర్యం లేని వారే కాషాయ పార్టీలో చేరతారని వ్యాఖ్యానించారు. అసోం సీఎం ప్రకటన సరైంది కాదని వీడియో సందేశంలో శశి థరూర్ తోసిపుచ్చారు. కాగా, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ కూడా ముగియక ముందే ఫలితం వెల్లడైందని. శశి థరూర్‌కు ఓటు వేసి సాహసం చూపిన వేయి మంది ప్రతినిధులు మాత్రమే కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్య ప్రియులని వారంతా త్వరలో బీజేపీలో చేరతారని తాను భావిస్తున్నానని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఇటీవల వ్యాఖ్యానించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)