పశ్చిమ బెంగాల్ దిబ్రూగడ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ రైలు ఎక్కేందుకు ఉత్తరప్రదేశ్లోని బరేలీ స్టేషన్కి ఓ జవాను రాగా, రైలెక్కే విషయంలో జవానుకి, టీటీకి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో రైలు కదులుతున్న సమయంలో రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన జవాన్ని సదరు టీటీఈ తోసేశాడు. దీంతో రైలు కింద పడిన జవాన్. తన రెండు కాళ్లను కోల్పోయాడు. విషయం తెలిసిన వెంటనే తోటి జవాన్లు గొడవ చేయడంతో స్టేషనులో ఘర్షణ వాతావరణం నెలకొంది. టీటీఈపై చర్యలు తీసుకోవాలని సైనికులు, ప్రయాణికులు డిమాండ్ చేశారు. జనాలు గుమిగూడడంతో సదరు టీటీఈ తెలివిగా అక్కడ నుంచి తప్పించుకున్నాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని టీటీఈ కోసం గాలిస్తున్నారు. గాయపడిన జవాన్ను ఆర్మీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం జవాన్ పరిస్థితి క్రిటికల్గా ఉందని సమాచారం.
రైలెక్కుతూ రెండు కాళ్లు కోల్పోయిన జవాన్
November 17, 2022
0
Tags