తెలంగాణలోని మేడ్చల్ జిల్లా జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ కు చెందిన పందుల కమిటీ కాలనీలో శ్రీను (35) జీవిస్తుండేవాడు. శ్రీను క్యాబ్ డ్రైవర్ గా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల కుటుంబ కలహాల కారణంగా శ్రీను తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీను దంపతులకు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. శ్రీను ఆత్మహత్య సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం శ్రీను మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి పోలీసులు తరలించారు.
Post a Comment
0Comments
3/related/default