శాఖాహార మొసలి మృతి

Telugu Lo Computer
0


కేరళలో కాసరగోడ్ జిల్లాలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని చెరువులో ఉండే బబియా అనే ఉండే శాఖాహార మొసలి మృతి చెందింది. బబియా కేవలం అన్నం మాత్రమే ఆహారంగా తీసుకునేదని ఆలయ అర్చకులు తెలిపారు. బబియా ఆలయాన్ని సంరక్షించడానికి దేవుడు నియమించిన సంరక్షకురాలిగా ఇక్కడి భక్తులు నమ్ముతారన్నారు. పూజారి పెట్టిన ప్రసాదం తప్పా మరేం తినేది కాదని భక్తులు చెబుతున్నారు. పూజా సమయంలో బబియా చెరువు నుంచి బయటకు వచ్చి గుడిలో స్వామి వారిని దర్శించుకునేదని ఆలయ అర్చకులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా తిరిగి చెరువులోకి వెళ్లిపోయేదన్నారు. మొసలి ఎప్పుడు క్రూరంగా ప్రవర్తించలేదన్నారు అర్చకులు. భక్తుల సందర్శనార్థం మొసలి మృతదేహాన్ని ఆలయ సమీపంలో ఉంచారు. భక్తులు తరలి వచ్చి నివాళులర్పిస్తున్నారు. మొసలికి దహన సంస్కారాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)