రాష్ట్రపతి కాటరాక్ట్ సర్జరీ

Telugu Lo Computer
0


భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు  కంటి శుక్లం శస్త్రచికిత్స జరిగింది. న్యూఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్ (రీసెర్చ్ అండ్ రిఫరల్)లో ఈ సర్జరీ నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ప్రతినిధి వివరాలను వెల్లడించారు. సర్జరీ విజయవంతంగా జరిగిందని.. ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ద్రౌపది ముర్ము ఈ ఏడాది జూలై 25న భారతదేశ 15వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. 64 ఏళ్ల ముర్ము జూలైలో 15వ భారత రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)