యువతిని రైలు కిందకు తోసిన ప్రేమోన్మాది

Telugu Lo Computer
0


చెన్నైలోని సెయింట్ థామస్ మౌంట్ రైల్వే స్టేషన్ లో గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు జరిగింది. అందరూ చూస్తుండగానే సతీష్ అనే వ్యక్తి 20 ఏళ్ల సత్యప్రియను తోసేయడంతో రైలు కింద పడి మరణించింది. సత్యప్రియ, సతీష్ ప్రేమ ప్రతిపాదనను తిరస్కరించడంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చెన్నైలోని ఆదంబాక్కంకు చెందిన సత్యప్రియ (20) నగరంలోని ఓ కాలేజీలో బీకాం చదువుతోంది. తల్లి పోలీస్ కానిస్టేబుల్ కాగా, తండ్రి ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన సతీష్ (32)కు సత్యప్రియతో పరిచయం ఉంది.  రైల్వే స్టేషన్లో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో తాంబరం నుంచి ఎగ్మోర్ వైపు వెళ్తున్న రైలు కిందకు సత్యప్రియను ప్లాట్‌ఫారమ్‌పై నుంచి తోసేశాడు. రైలు కింద పడి సత్యప్రియ అక్కడిక్కడే మరణించింది. వీరిద్దరి మధ్య వివాదం నడుస్తోందని వారి కుటుంబాలకు కూడా తెలుసని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటన జరిగిన తర్వాత సతీష్ అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు చెన్నై పొలీస్ కమిషనర్ శంకర్ జివాల్ తెలిపారు. ఈ ఘటనపై సీఎం స్టాలిన్ సీరియస్ అయ్యారు. దర్యాప్తు వేగవంతం చేసి నిందితుడిని అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. నిందితుడు సతీష్ కోసం ఏడు బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)