మహారాష్ట్రలోని నాసిక్లో సతీశ్ కేశవ్రావ్ అనే వ్యక్తికి నాసిక్లో ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఉంది. సుహాసిని అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని కొన్నేళ్ల క్రితం ఆయన భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఆ తర్వాత సతీశ్, సుహాసిని వివాహం చేసుకున్నారు. వారికి ఓ కుమారుడు జన్మించాడు. అయితే తొలి భార్యను ఆత్మహత్యకు ప్రేరేపించారన్న కేసులో సతీశ్ జైలుకు వెళ్లాడు. అతడు శిక్ష అనుభవిస్తున్న సమయంలో సుహాసిని మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. కానీ కొన్ని నెలలకే ఆ వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. ఇదిలా ఉండగా మహమ్మారి సమయంలో కొవిడ్ బారిన పడిన సుహాసిని చికిత్స కోసం సతీశ్ ఆస్పత్రిలో చేరింది. అప్పటికి జైలు నుంచి విడుదలైన సతీశ్తో మళ్లీ అనుబంధం పెరిగింది. దీంతో వారు మళ్లీ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే కొన్ని నెలల తర్వాత మరో వ్యక్తితో సుహాసినికి సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న సతీశ్ వారిద్దరినీ నిలదీశాడు. సెప్టెంబర్ 10న ఈ విషయమై వారి ముగ్గురి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే సతీశ్ను అంతమొందించాలని వారు పథకం వేశారు. సతీశ్కు సుహాసిని మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది. దీంతో స్పృహ తప్పి పడిపోయిన సతీశ్ కోమాలోకి వెళ్లిపోయారు. దాదాపు 33 రోజులుగా చికిత్స కొనసాగుతున్నా కోలుకోలేక గురువారం మృతి చెందారు. ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. సతీశ్, సుహాసినిల కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
వివాహేతర సంబంధం వైద్యుడి ప్రాణం తీసింది !
October 15, 2022
0