ఆంజనేయుడికి రైల్వే అధికారులు నోటీసు

Telugu Lo Computer
0


జార్ఖండ్‌లోని బెరక్‌బందల్ ఖాటిక్‌ ప్రాంతంలో ఉత్తరప్రదేశ్‌ నుంచి వలస వచ్చిన ఖాటిక్‌ తెగ ప్రజలు నివసిస్తున్నారు. వీరు గత 20 ఏళ్లుగా కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నారు. రైల్వేకు చెందిన స్థలంలో అక్రమంగా నివసిస్తున్నందున తక్షణమే గుడిసెలు ఖాళీ చేసి వెళ్లాలని రైల్వే అధికారులు నోటీసులిచ్చారు. ఇదే వరుసలో ఇక్కడే ఉన్న హనుమాన్‌ మందిరంలో ఉన్న ఆంజనేయుడికి కూడా నోటీసు ఇచ్చారు. 10 రోజుల్లో గుడి ఖాళీ చేసి వెళ్లాలని ఆదేశించారు. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. రైల్వే ఇచ్చిన నోటీసులో 'హనుమాన్ జీ' అని స్పష్టంగా రాసి ఉండటం కనిపిస్తుంది. 'మీరు తమ దేవాలయాన్ని రైల్వే భూమిలో నిర్మించుకున్నారు. మీరు అక్రమంగా ఆక్రమించుకున్నందున ఖాళీ చేయాలి' అని నోటీసులో పేర్కొన్నారు. ఈ నోటీసు అందిన 10 రోజుల్లో ఆలయాన్ని ఖాళీ చేసి సీనియర్ సెక్షన్ ఇంజనీర్ విభాగానికి అప్పగించాలని, లేదంటే మీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆంజనేయస్వామిని హెచ్చరించారు. కాగా, ఈ గుడిని 1931 లో నిర్మించినట్లుగా స్థానికులు చెబుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)