ముంబైలో ప్రముఖ బిల్డర్ ఆత్మహత్య

Telugu Lo Computer
0


ముంబై చించ్‌పోక్లీ రైల్వే స్టేషన్‌ సమీపంలోని శాంతి కమల్ హౌసింగ్ సొసైటీలో  తన నివాసంలో జిమ్‌ బాల్కనీ నుంచి  ప్రముఖ బిల్డర్‌ పరాస్ పోర్వాల్  దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, ఎవరినీ విచారించ వద్దని ఆయన ఆత్మహత్య లేఖలో పేర్కొన్నారు. పోలీసులు ఈ లేఖను పరాస్ జిమ్‌లో స్వాధీనం చేసుకున్నారు. పరాస్ కిందకు దూకిన వెంటనే అటువైపు నుంచి వెళ్తున్న ఒకరు చూసి పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక పోలీస్ స్టేషన్‌ సిబ్బంది నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరాస్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆయన బలవన్మరణానికి ఎందుకు పాల్పడ్డారనే విషయంపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)