ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లా కన్హై మండల్, జ్యోతి మండల్ కు ఏడాదిక్రితం వివాహం జరిగింది. దంపతులిద్దరు మల్కాన్గిరి జిల్లాలోని ఎంవీ 14 గ్రామంలో నివాసముంటున్నారు. భార్య మీద ప్రేమతో కన్హై.. ఓ ఖరీదైన ఫోన్ను జ్యోతికి గిఫ్ట్గా ఇచ్చాడు. అయితే ఫోన్ ను ఒకేసారి డబ్బు చెల్లించి కొనడం వీలుకాని కన్హై.. ఆ మొత్తాన్ని ఈఎంఐ రూపంలో నెలవారీగా చెల్లిస్తున్నాడు. ఈ క్రమంలో ఈఎంఐ కాస్తా ముగిసింది. దాంతో ఫైనాన్స్ కంపెనీకి చెందిన ప్రతినిధులు కన్హై సంతకం కోసం వారింటికి వచ్చారు. విషయం తెలుసుకున్న ఆమె మనస్థాపానికి గురైంది. తనకు తెలియకుండా ఈఎంఐలో ఫోన్ ఎందుకు కొన్నావని భర్తతో గొడవకు దిగింది. మాటామాటా పెరగడంతో కోపోద్రిక్తురాలైన జ్యోతి తన భర్త ముందే పురుగుల మందు తాగింది. షాక్ గురైన కన్హై స్పృహతప్పి పడిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే వారిద్దరిని ఆసుపత్రికి తరలించారు. జ్యోతి పరిస్థితి విషమిండంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, భర్త కన్హై కోలుకుంటున్నాడు.
ఈఎంఐలో ఫోన్ కొని గిఫ్ట్ ఇచ్చినందుకు భార్య ఆత్మహత్య
October 20, 2022
0
Tags