అమ్మకానికి ఐశ్వర్య రాయ్‌, త్రిషల నగలు !

Telugu Lo Computer
0


దివంగత ప్రఖ్యాత తమిళ రచయిత కల్కి కలం నుంచి జారువాలిన నవల పొన్నియిన్‌ సెల్వన్‌. నాలుగు దశాబ్దాలకు పైగా ఈ నవల ప్రతులను అనేక మంది అనేకసార్లు ముద్రిస్తూనే ఉన్నారు. అంతగా తమిళ ప్రజల మనసుల్లో మమేకమై పోయింది ఈ నవల. మరో విశేషం ఏంటంటే దీనిని ఎంజీఆర్‌ నుంచి కమలహాసన్‌ వరకు చిత్రంగా మలచాలని ప్రయత్నించారు. చివరికి దర్శకుడు మణిరత్నం దీన్ని తెరకెక్కించారు. విక్రమ్, కార్తీ, జయం రవి, విక్రమ్‌ ప్రభు, శరత్‌కుమార్, ప్రభు, పార్తీబన్, జయరాం, ఐశ్వర్యారాయ్, త్రిష, ఐశ్వర్య, లక్ష్మి వంటి ముఖ్య తారలు నటించిన ఈ చిత్రానికి ఏఆర్‌ రెహామాన్‌ సంగీతం అందించారు. కాగా ఈ చిత్రం తొలిభాగం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. దీంతో చిత్ర యూనిట్‌ ప్రస్తుతం ప్రచా ర కార్యక్రమాల్లో భాగంగా వివిధ రాష్ట్రాలను చుట్టేస్తోంది. ఇందులో నటించిన హీరోలు ఐశ్వర్యారాయ్‌తో ఫొటోలు దిగడం, అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతూ చిత్రంపై మరింత హైప్‌ను పెంచేస్తున్నాయి. కాగా మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇది రాజుల నేపథ్యంలో రూపొందిన చిత్రం. ఇందులో నటి ఐశ్వర్యారాయ్‌ నందినిగానూ, త్రిష కుందవై రాణిగానూ నటించారు. ఆ పాత్రల కోసం వీరిద్దరూ ధరించిన ఆభరణాలను వేలం వేయడానికి చిత్ర యూనిట్‌ సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం.

Post a Comment

0Comments

Post a Comment (0)