ఉత్తరప్రదేశ్కి చెందిన ఒక రైతు తన ఇంట్లోని గేదే దూడకు గుండు కొట్టించి, ఊరందరికి భోజనాలు పెట్టించాడు. హర్దోయి జిల్లాలో ఈ వింత సంఘటన చోటుచేసుకుంది. బఘోలీ పీఎస్ పరిధిలోని సున్ని గ్రామానికి చెందిన ప్రమోద్ శ్రీవాస్తవ అనే రైతు తాను పెంచుకుంటున్న దూడకు నవరాత్రుల మొదటి రోజున దుర్గా ఆలయంలో గుండు కొట్టించాడు. అంగరంగ వైభవంగా దుర్గా ఆలయ ప్రాంగణం వద్దకు చేరుకుని ఓ దూడకు గుండు చేయించాడు. వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్న గ్రామస్తులకు విందు ఏర్పాటు చేశాడు. అతను ఇలా చేయడానికి కారణం అతని ఇంట్లోని దూడలు చనిపోతున్నాయని, తన గేదే పిల్లలన్నీ కడుపులోనే చనిపోతుండటంతో ఆ దూడ పుట్టాలని కోరుకున్నట్లు వెల్లడించారు. కోరిక తీరడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలిసి దూడకు గుండు కొట్టించాడు. ఈ కార్యక్రమానికి గ్రామస్తులతో పాటు బంధుమిత్రులను కూడా ఆహ్వానించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
దూడకు గుండు కొట్టించిన రైతు !
September 28, 2022
0