భార్యను చంపిన భర్త

Telugu Lo Computer
0


ముంబైలో  అమానవీయకర సంఘటన జరిగింది. ఇక్బాల్ షేక్ అనే వ్యక్తి, రూపాలి అనే యువతిని 2019లో పెళ్లి చేసుకున్నాడు. ఆమె తన పేరును జరాగా మార్చుకుంది. 2020 లో వీరికి కొడుకు పుట్టాడు. అయితే కొన్ని రోజులుగా భర్త భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో బురఖా ధరించాలని భార్యను వేధించడం మొదలు పెట్టాడు. దీనికి ఆమె ఒప్పుకోలేదు. అతని వేధింపులు రోజురోజుకి ఎక్కువ కావడంతో ఆమె తన కొడుకుతో కొన్నినెలలుగా విడిగా ఉంటుంది. దీంతో సెప్టెంబరు 26 న మాట్లాడుకుందామని ఆమెను పిలిచాడు. ఆ తర్వాత రాత్రి 10 గంటల సమయంలో ఆమెను కత్తితో పొట్టలో పలుమార్లు పొడిచి హత్య చేశాడు. దీంతో ఆమె అక్కడే చనిపోయింది. దీంతో చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)