చైనాలో మన సినిమాలు

Telugu Lo Computer
0


మన సినిమాలు చైనాలో ఎక్కువ బిజినెస్​ చేస్తున్నాయని మినిస్ట్రీ ఆఫ్​ ఇన్ఫర్మేషన్​ అండ్​ బ్రాడ్​కాస్టింగ్​ (ఎంఐబీ) సెక్రటరీ అపూర్వ చంద్ర వెల్లడించారు. మన సినిమాలు మన దేశంలోనే ఎక్కువ బిజినెస్​ చేసేలా చొరవ తీసుకోవల్సి ఉందని చెప్పారు. ఈ ట్రెండ్​ను రివర్స్​ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మీడియా, ఎంటర్​టెయిన్​మెంట్​పై ఫిక్కి నిర్వహించిన ఈవెంట్లో అపూర్వ చంద్ర పాల్గొన్నారు. ఆరేళ్ల కిందట దేశంలో 12 వేల దాకా థియేటర్లు ఉండేవని, అవి ఇప్పుడు 8 వేలకి తగ్గిపోయాయని ఆయన చెప్పారు. ఇదే టైములో చైనాలోని ఫిల్మ్​ ఎగ్జిబిషన్​ హాల్స్​ సంఖ్య 10 వేల నుంచి ఏకంగా 70 వేలకి పెరగడాన్ని గమనించాలని పేర్కొన్నారు. మన సినిమాలు ఆ దేశంలో ఎక్కువ బిజినెస్​ చేయడానికి ఇదొక కారణమని చెబుతూ, ఈ ట్రెండ్​ను మనం రివర్స్​ చేయాలని సూచించారు. ఇందుకు దేశంలో మరిన్ని థియేటర్లు తెరవడమే సరయిన సొల్యూషన్​గా పేర్కొన్నారు. ఈ టాస్క్​ను దేశంలో కొత్తగా ఏర్పాటయిన ఫిల్మ్​ ఫెసిలిటేషన్​ ఆఫీస్​ (ఎఫ్ఎఫ్ఓ)కి ప్రభుత్వం అప్పచెబుతున్నట్లు అపూర్వ చంద్ర వెల్లడించారు. ఇన్వెస్ట్​ ఇండియా, నేషనల్​ సింగిల్​ విండో పోర్టల్​లతో కలిసి ఎఫ్​ఎఫ్​ఓ ఇందుకోసం పనిచేస్తుందన్నారు. థియేటర్​ ఏర్పాటు చేయడం అంటే ఒక ఇండస్ట్రీ నెలకొల్పడం లాంటిదేనని ఆయన పేర్కొన్నారు. 10 లక్షల మంది జనాభా ఉన్న మాల్దా (వెస్ట్​ బెంగాల్​)లో ఒక్క థియేటర్​ కూడా లేకపోవడం దురదృష్టకరమని చెప్పారు. ప్రభుత్వ చొరవతో కర్నాటకలోని చిన్న సిటీలలో గత నాలుగు నెలలలో కొత్తగా ఆరు థియేటర్లు ఏర్పాటయ్యాయని , మరిన్ని రావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. కిందటి వారాంతంలో రూ. 75 టికెట్​ ఆఫర్​ చాలా మందిని ఆకట్టుకుందని, మార్నింగ్​ షోలకు సైతం జనం ఎగబడ్డారని పేర్కొన్నారు. సినిమా టికెట్ల రేట్లు సమంజసమైనవిగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నట్లు అపూర్వ చంద్ర చెప్పారు. సినిమా ఎగ్జిబిషన్​ ఇండస్ట్రీ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)